ఇంటి నుంచి వెళ్లిన కొద్ది సేపటికే బలవన్మరణం

ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు కొద్ది సేపటికే ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-20 14:34 GMT

దిశ, శామీర్ పేట : ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు కొద్ది సేపటికే ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మజీద్ పూర్ గ్రామానికి చెందిన వినయ్ రాజు (23) ఆదివారం మధ్యాహ్నం బైక్ పై ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు.

    అతను వెళ్లిన కొద్దిసేపటికి వినయ్ రాజు తండ్రి మజీద్ పూర్ లోని తన పొలం దగ్గరికి వెళ్లగా బైకు కనిపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా హన్మల్ల కుంట పక్కన ఉన్న ఒక చెట్టుకి కరెంటు కేబుల్ తో ఉరివేసుకొని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News