కేసముద్రంలో గుర్తు తెలియని మృతదేహం..
ఈ రోజు ఉదయం కేసముద్రం స్టేషన్ ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద గల
దిశ, కేసముద్రం : ఈ రోజు ఉదయం కేసముద్రం స్టేషన్ ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద గల ముత్యాలమ్మ గుడి దగ్గరలో ఒక గుర్తు తెలియని (మగ వ్యక్తి) మృతదేహం లభ్యం అయ్యింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా.సదరు వ్యక్తి యాచకుడుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.