పిడుగుపాటుకు యువ రైతు మృతి..

పిడుగుపాటుకు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది.

Update: 2024-10-14 15:31 GMT

దిశ, కల్హేర్: పిడుగుపాటుకు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం రవి (25) సోమవారం సాయంత్రం పశువులకు పచ్చి గడ్డి తీసుకు రావడానికి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలోకి వెళ్లాడు. పచ్చి గడ్డి కొస్తున్న తరుణంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడడంతో పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Similar News