పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

కోటపల్లి గ్రామానికి చెందిన లకాకుల శివప్రసాద్ (30) వ్యాపారం చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు. ఉన్నపలంగా జీవితంపై విరక్తి పుట్టి విషం సేవించి సూసైడ్ చేసుకోవడం జరిగింది.

Update: 2024-10-15 16:33 GMT

దిశ, కోట్ పల్లి: కోటపల్లి గ్రామానికి చెందిన లకాకుల శివప్రసాద్ (30) వ్యాపారం చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు. ఉన్నపలంగా జీవితంపై విరక్తి పుట్టి విషం సేవించి సూసైడ్ చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే… శివప్రసాద్ (30) చదివింది ఇంటర్మీడియట్ ఆపై చదువు కొనసాగిస్తూనే తండ్రి తోపాటు, ఫర్టిలైజర్ వ్యాపారం చేసుకునేవాడు. శివప్రసాద్ కు భార్య 5 ఏళ్ల పాప 2సంవత్సరాల బాబు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రోజు వికారాబాద్ వెళ్లే మార్గంలో తన కారులో పాయిజన్ కలుపుకొని సేవించి సూసైడ్ చేసుకున్నట్లు రహదారి పై వెళ్లే వాహనదారులు తెలిపారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News