టీడీపీ విమర్శలకు జగన్ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని, సీఎంను బూతులు తిట్టడం కరెక్టేనా? అని ప్రతిపక్ష టీడీపీని ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. సీఎంను కూడా దారుణమైన బూతులతో తిడుతున్నారని, రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నామన్నారు. గిట్టని మనిషి అధికారంలో ఉన్నాడని ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇది తన ఒక్కడి మీద జరుగుతున్న దాడి కాదని, రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న దాడి అని జగన్ పేర్కొన్నారు. ‘డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. […]

Update: 2021-10-20 21:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని, సీఎంను బూతులు తిట్టడం కరెక్టేనా? అని ప్రతిపక్ష టీడీపీని ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. సీఎంను కూడా దారుణమైన బూతులతో తిడుతున్నారని, రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నామన్నారు. గిట్టని మనిషి అధికారంలో ఉన్నాడని ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇది తన ఒక్కడి మీద జరుగుతున్న దాడి కాదని, రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న దాడి అని జగన్ పేర్కొన్నారు.

‘డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. సంఘవిద్రోహ శక్తుల విషయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు బలహీన వర్గాల విషయంలో పోలీసులు రాజీ పడొద్దు’ అని జగన్ చెప్పారు.

Tags:    

Similar News