వరద బాధితులకు అండగా నిలిచిన టాలీవుడ్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-06 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఏపీ లోని విజయవాడను, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ఉద్యోగులు ముందుకు వచ్చారు. అలాగే టాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా విరాళం అందించడానికి ముందుకు వచ్చింది. మరి ఎవరెవరు ఎంత ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం..

ఎన్టీఆర్.. రూ.1 కోటి

మెగాస్టార్ చిరంజీవి.. రూ.1 కోటి

రామ్ చరణ్.. రూ.1 కోటి

వరుణ్ తేజ్.. రూ.15 లక్షలు (రెండు తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున అలాగే పవన్ కళ్యాణ్‌ను అనుసరిస్తూ ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థకు 5లక్షలు)

విశ్వక్ సేన్.. రూ.5 లక్షలు

మహేష్ బాబు.. రూ.1 కోటి

అల్లు అర్జున్.. రూ.1 కోటి

అక్కినేని ఫ్యామిలీ.. రూ.1 కోటి

సాయి ధరమ్ తేజ్.. రూ.25 లక్షలు

పవన్ కళ్యాణ్.. రూ.6 కోట్లు

ప్రభాస్.. రూ.2 కోట్లు

బాలకృష్ణ.. రూ.1 కోటి

సిద్దు జొన్నలగడ్డ.. రూ.30 లక్షలు

త్రివిక్రమ్.. రూ.50 లక్షలు

ఫిల్మ్ ఛాంబర్ తరపున.. రూ.50 లక్షలు

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున.. రూ.20 లక్షలు

ఫిల్మ్ ఫెడరేషన్ తరపున.. రూ.10 లక్షలు

దగ్గుబాటి కుటుంబం.. రూ.1 కోటి

దిల్ రాజు.. రూ.50 లక్షలు


Similar News