ఆ మూవీ సీక్వెల్ 3 కూడా ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి(Sri Simha Koduri) మత్తు వదలరా(Mathu vadalara) అనే మూవీతో 2019లో హీరోగా పరిచయమయ్యాడు.

Update: 2024-09-16 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి(Sri Simha Koduri) మత్తు వదలరా(Mathu vadalara) అనే మూవీతో 2019లో హీరోగా పరిచయమయ్యాడు. కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా అదే టీమ్‌తో ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara2) సినిమా వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) జంటగా సత్య(Sathya), సునీల్(Sunil), రోహిణి(Rohini), వెన్నెల కిషోర్(Vennela Kishore), అజయ్(Ajay).. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సక్సేస్ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్ రితేశ్ రానా, హీరో శ్రీసింహ ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ రితేష్ మాట్లాడుతూ.. "మత్తు వదలరా పార్టు 3 కూడా తీస్తాము. కాకపోతే ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను” అని వెల్లడించారు. అలాగే హీరో శ్రీసింహ మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడం ఆనందాన్నిస్తోంది అని తెలిపారు.

Read More : Megastar Chiranjeevi: హ్యాట్స్ ఆఫ్ రితేష్ రాణా.. 'మత్తు వదలరా 2’ పై చిరు ట్వీట్ వైరల్


Similar News