ఎట్టకేలకు మెగా హీరోతో పెళ్లిపై స్పందించిన యంగ్ బ్యూటీ.. అందరికీ క్లారిటీ వచ్చేసిందిగా

‘శివ మనసులో శృతి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా(Regina Cassandra) అందరికీ సుపరిచితమే.

Update: 2024-09-16 04:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘శివ మనసులో శృతి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా(Regina Cassandra) అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, రారా కృష్ణయ్య, అ, ఆచార్య, శాకిని డాకిని, నేనే నా వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నది. ఇక తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్‌లోనే మూవీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే మళ్లీ తాజాగా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి ‘ఉత్సవం’(Utsavam) అనే మూవీతో మన ముందుకు వచ్చింది. అర్జున్ సాయి(Arjun Sai) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్(Dileep Prakash), రెజీనా జంటగా నటించారు. హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్స్ పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. ఈ క్రమంలో మెగా మేనల్లుడు హీరో సాయి దుర్గ తేజ్‌(Sai Durga Tej)తో పెళ్లి విషయంపై వినిపిస్తున్న రూమర్లు గురించి మాట్లాడింది.. ఆమె మాట్లాడుతూ.. "సాయి తేజ్ నాకు మంచి స్నేహితుడు. అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు. అయితే కొంతమంది మా మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యాన్ని కొందరు ప్రేమ అనుకుంటూ పెళ్లి పుకార్లు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు" అని రెజీనా పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు బ్రేక్ పడినట్లు అయింది.

Tags:    

Similar News