ఆ కుంభకోణంపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? మేడిపల్లి సత్యం

Update: 2022-02-11 12:15 GMT

దిశ, రామడుగు: కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సదరం సర్టిఫికెట్‌ల దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. ఆరు నెలలుగా నకిలీ సర్టిఫికెట్ల దందాపై పత్రికల్లో కథనాలు వస్తున్నా.. ఎందుకు స్పందించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అంతర్గత విచారణ చేయడానికి కూడా ఎందుకు సాహసం చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఈ దందా వల్ల అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందకుండా.. పక్కదారి పడుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చలనం లేదని పేర్కొన్నారు. నకిలీ సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న పాత్రధారులు, సూత్రధారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. వారిపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీఎం‌హెచ్‌ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News