తిరుపతి కొవిడ్ సెంటర్‌లో ప్రమాదం..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుపతి కొవిడ్ సెంటర్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. స్విమ్స్ ఆస్పత్రి పద్మావతి కొవిడ్ సెంటర్‌లో కొత్త భవనం శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో అటెండర్ రాధిక మృతి చెందగా, మరో ఇద్దరు కరోనా బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ భవనం ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకోగా, అధికారులు అందులో కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించారు. కొత్త భవనంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై మిగతా రోగులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, […]

Update: 2020-10-04 22:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుపతి కొవిడ్ సెంటర్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. స్విమ్స్ ఆస్పత్రి పద్మావతి కొవిడ్ సెంటర్‌లో కొత్త భవనం శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో అటెండర్ రాధిక మృతి చెందగా, మరో ఇద్దరు కరోనా బాధితులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ భవనం ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకోగా, అధికారులు అందులో కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించారు. కొత్త భవనంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై మిగతా రోగులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, క్షతగాత్రులను వేరే వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News