ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం..

దిశ, కోదాడ: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ‌కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌‌రోడ్‌‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్‌‌ వైపు నారాయణ స్వామి కాన్వాయ్ వెళుతోంది. ఈ క్రమంలో కోదాడ పట్టణ సమీపంలోని భారత్‌‌ పెట్రోల్‌ ‌బంక్‌ ‌వద్దకు రాగానే ముందు వెళుతున్న ఎస్కార్ట్‌ ‌వాహనం సడన్‌గా బ్రేక్ వేసింది. దీంతో వెనుక […]

Update: 2020-11-27 09:00 GMT

దిశ, కోదాడ: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ‌కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌‌రోడ్‌‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్‌‌ వైపు నారాయణ స్వామి కాన్వాయ్ వెళుతోంది. ఈ క్రమంలో కోదాడ పట్టణ సమీపంలోని భారత్‌‌ పెట్రోల్‌ ‌బంక్‌ ‌వద్దకు రాగానే ముందు వెళుతున్న ఎస్కార్ట్‌ ‌వాహనం సడన్‌గా బ్రేక్ వేసింది.

దీంతో వెనుక వాహనాలు కూడా సడన్‌ బ్రేకులు వేయడంతో ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ క్రమంలో నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆయనకు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ప్రమాదం జరిగిన తరువాత వాహనాలను పరిశీలించిన భద్రతా సిబ్బంది వాహనాలు సక్రమంగా ఉండడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారని స్థానికుల వెల్లడించారు.

Tags:    

Similar News