Eatala Rajender: సీఎంలను దించేందుకు మతకలహాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్: ఈటల

సీఎంలను దించేందుకు మతకలహాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్ అని ఈటల ఆరోపించారు.

Update: 2024-10-22 10:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎంలను దించేందుకు మతకలహాలను సృష్టించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. ముత్యాలమ్మ గుడి విషయంలో ప్రశాంతంగా ర్యాలీ చేస్తే మా కార్యకర్తలపై హత్యయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బయటివాళ్లు వచ్చి చెప్పులు వేస్తే మా వాళ్లపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారన్నారు. ఇకనైనా అన్ని వర్గాల క్షేమం కోసం పని చేయాలని లేకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదన్నారు. బాంబు పేలుళ్లు, రక్తపాతాన్ని ఏ మత పెద్దలు సహించరన్నారు.


Similar News