కడప జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ, బీజేపీ వర్గీయుల ఘర్షణ

కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ...

Update: 2024-10-18 17:21 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడుల చేసుకున్నారు. టీడీపీ వర్గీయుడికి మద్యం షాపు వచ్చింది. దీంతో ఆయన షాపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బీజేపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మద్యం షాపును మూసి వేయించి.. స్థానికంగా భారీగా మోహరించారు. ముద్దనూరులో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు.


Similar News