TDP: సీటు ఒకటి.. పోటీ ఇద్దరు..!

కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..

Update: 2024-02-03 14:34 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రొద్దుటూరు టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి, ప్రొద్దుటూరు ఇంచార్జి ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డి టికెట్ ఫైట్ జరుగుతోంది. దీంతో ఈ ఇద్దరు నేతల వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ప్రొద్దుటూరు సీటు తనదేనంటూ నియోజకవర్గంలో ప్రవీణ్ రెడ్డి పోస్టర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లా ఇంచార్జి లింగారెడ్డి మండిపడుతున్నారు.


శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిని తానేనని చెప్పారు. సీనియర్ నేతగా తనకు తప్ప ఎవరికి అర్హత లేదని పేర్కొన్నారు. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు పోస్టర్లు వేసుకుంటే పార్టీ ఎందుకు ఉన్నట్టు అని ప్రశ్నించారు. ఇప్పటికి వరకూ ప్రొద్దుటూరు టికెట్‌ను తమ అధినేత చంద్రబాబు ఎవరూ కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు టికెట్ విషయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గందరగోళానికి గురవ్వొద్దని లింగారెడ్డి తెలిపారు. పోస్టర్ల అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అధినేత నిర్ణయాన్ని బట్టే తదుపరి కార్యచరణ ఉంటుందని లింగారెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News