Ys Sharmila: మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా?: విజయసాయిరెడ్డికి సవాల్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు...

Update: 2024-10-27 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆస్తుల పంపకాల వివాదంలో వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Rajya Sabha MP Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్‌(YCP chief Jagan)ను ఇబ్బంది పెట్టేందుకే ఆయన తల్లి విజయమ్మతో కలిసి షర్మిల ప్రెస్‌మీట్లు పెడుతూ ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. వైసీపీ రాజ్య సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చాలా సార్లు జగన్ స్ర్రిప్ట్ చదివారని విమర్శించారు. అలా చేయలేదని విజయసాయిరెడ్డి ప్రమాణం చేస్తారా అని షర్మిల సవాల్ విసిరారు. ఆస్తుల్లో నలుగురు మనవళ్లకు సమాన వాటా అని వైఎస్సార్ అన్నారని, అది అబద్ధమని విజయసాయిరెడ్డి తమ బిడ్డలపై ప్రమాణం చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వ్యక్తేనని ఎద్దేవా చేశారు. జగన్ వల్ల విజయసాయిరెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారని చెప్పారు. అందువల్లే జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.




Similar News