AP News:టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కీలక పరిణామం..?

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-09-14 15:08 GMT

దిశ,వెబ్‌డెస్క్:గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యాలయం(TDP Office) పై దాడి కేసులో వైసీపీ నేతలు(YCP Leaders) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు(శనివారం) విచారణకు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీలు(YCP MLC) తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాశ్ నేడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వారి వెంట న్యాయవాది గవాస్కర్ కూడా ఉన్నారు. గత మూడు గంటలుగా విచారణ కొనసాగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం అడిగినా వైసీపీ నేతల నుంచి తెలియదంటూ సమాధానాలు వస్తున్నట్లు సమాచారం.


Similar News