AP News:ఐపీఎస్‌లపై ఆరోపణలు..డీజీపీతో చర్చిస్తాం:సీపీ

ఏపీలో సంచలనంగా మారిన బాలీవుడ్ నటిపై కేసుకు సంబంధించి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పందించారు.

Update: 2024-08-29 09:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన బాలీవుడ్ నటిపై కేసుకు సంబంధించి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పందించారు. అయితే ఈ ఘటన పై ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించి ఆమెను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని డీజీపీ ద్వారకా తిరుమల రావును ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాం అని విజయవాడ సీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అన్నారు. దీనిపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని సీపీ తెలిపారు.


Similar News