వీఆర్వో అదృశ్యం.. రెండు రోజులు గడుస్తున్న తెలియని ఆచూకీ

ముప్పాళ్ళ మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు అదృశ్యం కలకలం రేపుతోంది.

Update: 2024-10-02 12:35 GMT

దిశ, పల్నాడు: ముప్పాళ్ళ మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఫోన్ ఇంట్లో వదిలేసి వీఆర్వో కనిపించకుండా పోయారు. రెండు రోజులు గడుస్తున్నా వీఆర్వో ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వీఆర్వోకు ఎవరితోనైనా విభేదాలు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా వీఆర్వో కాల్ డేటాను సేకరించి ఎవరెవరితో మాట్లాడుతున్నారో గమనించారు. అదృశ్యానీకి గల కారణాలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు.


Similar News