నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు ఆదృశ్యం

ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జున రావు ఆదృశ్యం కలకలం రేపుతోంది.

Update: 2024-10-03 08:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జున రావు ఆదృశ్యం కలకలం రేపుతోంది. వీఆర్వో మల్లికార్జున రావు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. మల్లికార్జున రావు సూసైడ్ నోట్ లో నా చావుకు ఎవరు కారణం కాదని, నా శవాన్ని ఎవరికి దొరకనివ్వనని, అక్క ,బావ నన్ను క్షమించండిని రాసి ఉంది. నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, మానసిక ఒత్తిడికి లోనయ్యానని, ఇల్లు నరకంలా మారిపోయిందని రాశాడు. వీఆర్వో మల్లికార్జున రావు ఆదృశ్యంపై ముప్పాళ్ళ ఎస్సై సోమేశ్వరావు స్పందిస్తూ వీఆర్వో మల్లికార్జున రావు ఆదృశ్యం పై కేసు చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శ్రీశైలం వెళ్లాడని సమాచారంతో శ్రీశైలంకు కూడా ప్రత్యేక బృందాన్ని పంపించామన్నారు. వీఆర్వో మల్లికార్జున రావు సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. 


Similar News