Breaking: వివేకా కేసులో సునీల్ యాదవ్‌‌కు భారీ ఊరట

మాజీ మంత్రి, దివంగత నేత వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు భారీ ఊరట లభించింది...

Update: 2024-10-03 11:13 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, దివంగత నేత వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder Case)లో నిందితుడు సునీల్ యాదవ్‌(Sunil Yadav)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు (Bail Grant)చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత బ్యాండ్‌తో పాటు రూ. 25 వేల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. అలాగే ప్రతి శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.

కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోరారు.


Similar News