YS Jagan:‘ఆ తేడాను ప్రజలు గమనించారు’.. కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-03 10:11 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ZPTC, ఇతర నాయకులతో వైఎస్‌ జగన్ నేడు(గురువారం) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అన్యాయమైన పాలన కొనసాగుతోంద‌ని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే(YSRCP) అన్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లో విశ్వసనీయత(Credibility), వ్యక్తిత్వం(Personality) అనేవి చాలా ముఖ్యమని జగన్ తెలిపారు. కష్టం వచ్చినప్పుడు ప్ర‌జ‌ల‌కు అండగా నిలబడగ‌లిగితే అదే మ‌న‌ల్ని త‌ర్వాత విజ‌య‌తీరాలకు చేరుస్తుంద‌ని కార్య‌క‌ర్త‌లకు వైఎస్ జగన్ తెలిపారు.

ఈ క్రమంలో గత ఐదేళ్లలో YCP ప్ర‌భుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారాయని దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు మోసాలపై క్ర‌మంగా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని అన్నారు. వైసీపీ, టీడీపీ(TDP) మధ్య తేడాను ప్రజలు గమనించారని జగన్ అన్నారు. వైసీపీ కార్యకర్తలకు(YCP Workers) వైఎస్‌ జగన్‌ భరోసా కల్పించారు. కార్యకర్తలు ఎవరు కూడా కేసులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజెంట్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్ర స్థాయిలో ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News