Simhachalam పుష్కరిణిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

Update: 2023-04-01 15:49 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లా సింహాచలం కోనేరు వరాహ పుష్కరిణిలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. అప్పలరాజు(42) అనే వ్యక్తి మద్యం మత్తులో చెరువులో చేపల వేటకు వెళ్లి మునిగిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడు ప్రహ్లాదపురం దగ్గర విరాట్ నగర్ వాసిగా గుర్తించారు. మృతదేహం వెలుపలికి తీసిన తర్వాత, ఎవరో కొట్టి హత్య చేసి చెరువులో పడేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. గోపాలపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News