రాజ్యసభ కు ఎంపికైన సుబ్బారెడ్డికి ఘన స్వాగతం..

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైవీ సుబ్బారెడ్డి కి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు.

Update: 2024-02-24 15:07 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైవీ సుబ్బారెడ్డి కి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు , మంత్రి గుడివాడ అమర్నాథ్ , మేయర్ జి. హరివెంకటకుమారి , అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి. సత్యవతి, ఎమ్మెల్యే లు అవంతి శ్రీనివాస్, కంబాల జోగులు , తిప్పల నాగిరెడ్డి , నియోజకవర్గం ఇంచార్జిలు కెకె రాజు, ఆడారి ఆనంద్ గారు, వరికుటి చందు , నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గజ మాలలతో సుబ్బారెడ్డి కి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు.


Similar News