రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-13 10:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను జరపనుంది. రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ 'యువగళం' పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్రలో విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు.

అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వాల్మీకి జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. 


Similar News