తేనెటీగల దాడిలో చిన్నారి మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-10-13 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా..మరో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంచంగిపుట్టు మండలం ఎగకంటవరంలో చెట్ల వద్ద ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లపై తేనెటీగలు దాడిచేశాయి. తీవ్ర గాయాలపాలైన వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. నాలుగేళ్ల చిన్నారి గౌరి కజీకిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా.. ఆమె అన్న విశ్వకు చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News