తిరుపతి వెళ్తున్న చంద్రబాబు.. మధ్యలో అనూహ్య పరిణామం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాన్వాయ్‌లో వెళ్తుండగా చంద్రబాబుకు అనూహ్య పరిణామం ఎదురైంది....

Update: 2024-06-12 15:23 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. అయితే మధ్యలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానం వద్దకు వెళ్తు్న్న చంద్రబాబు కాన్వాయ్‌ను ఓ కార్యకర్త వెంబడించారు. ఒక్కసారి చంద్రబాబును కలవాలంటూ కోరారు. దీంతో కాన్వాయ్ ఆపి కార్యకర్తను చంద్రబాబు కలిశారు. మిగిలిన కార్యకర్తలకు కూడా అభివాదం చేశారు. అనంతరం తిరుపతి బయల్దేరి వెళ్లారు. 

Tags:    

Similar News