AP News:ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

పిడుగురాళ్ల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి, పిడుగురాళ్ల యన్.శ్రీనివాస రెడ్డి ఈ రోజు(మంగళవారం) ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.

Update: 2024-10-15 14:26 GMT

దిశ, పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి, పిడుగురాళ్ల యన్.శ్రీనివాస రెడ్డి ఈ రోజు(మంగళవారం) ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు పుస్తకాలు పరిశీలించారు. ఎవరైనా ఎరువులు అధిక ధరలకు అమ్మినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలియజేశారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి అని చెప్పారు. అలాగే రైతులకు ఎరువులు అమ్మిన వెంటనే ఈ-పాస్ తప్పనిసరిగా పూర్తి చేయాలని తెలియజేశారు.


Similar News