‘వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగం’.. మాజీ సీఎం జగన్ పై పట్టాభిరామ్ ఫైర్

ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ మంగళవారం విజయవాడలో మరోసారి ఫైరయ్యారు.

Update: 2024-10-15 15:22 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ నేడు (మంగళవారం) విజయవాడలో మరోసారి ఫైరయ్యారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం కోట్లాది రూపాయలు మింగిన అనకొండ జగన్ అని విమర్శించారు. జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు అయిన ఖర్చు సాధారణ పరిపాలన శాఖ లెక్కల ప్రకారం రూ.12.85 కోట్లు అని ఆయన పేర్కొన్నారు.

సీఎంగా జగన్ ఉన్న సమయంలో ఏ విధంగా వందల, వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చు చేశాడో.. వాటికి నిదర్శనం నేడు ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌తోపాటు రూషికొండ ప్యాలస్‌లోని బాత్ టబ్‌ల నుంచి మసాజ్ టేబుళ్ల వరకు అన్ని ప్రజల సొమ్ముతోనే చేయించుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణించడానికి సామాన్యులకు అనుమతులిచ్చారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా... ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఎవరూ కూడా ఇంటి చుట్టూ ఇలాంటి ఇనుప కంచెను ఏర్పాటు చేసి ఉండరని పట్టాభిరామ్ గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.


Similar News