Trending: ఎంతపని చేశార్రా..! వ్యభిచారం చేయిస్తూ యూఎస్‌లో పట్టుబడిన తెలుగు యువకులు

ఉన్నత చదువులు చదివి ఉద్దరిస్తారని కన్నోళ్లు అమెరికా పంపితే.. మాతృ దేశానికే మాయనిమచ్చ తెచ్చారు.

Update: 2024-08-22 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువులు చదివి ఉద్దరిస్తారని కన్నోళ్లు అమెరికా పంపితే.. మాతృ దేశానికే మాయనిమచ్చ తెచ్చారు. దేశం కాని దేశంలో చేయరాని పనిచేసి తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా.. ఓ ఐదుగురు యువకులు చేసిన ఘనకార్యం గురించే. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువకులు ఉన్నత చదువుల నిమిత్తం టెక్సాస్‌‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే వాళ్లకు అక్కడున్న కొందరి లోకల్ యువకులతో పరిచయం ఏర్పడింది. కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ప్లాన్‌తో టెక్సాస్‌లోని డెంటన్ ప్రాంతంలో లోకల్‌గా ఉన్న 8 మందితో కలిసి ఏడుగురు భారత యువకులు వ్యభిచారం చేయించే వృత్తిలోకి దిగారు. అయితే, డెంటన్ కౌంటీ షెరీఫ్ వాళ్లు వ్యభిచారాన్ని అరికట్టేందుకు హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సహాకారంతో ఓ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. పక్కాగా వ్యభిచారం చేస్తున్నారని నిర్ధారించుకున్న తరువాత ఆ స్థావరంపై వాళ్లు రైడ్ చేయగా మొత్తం 18 మంది ముఠా సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అందులో ఏడుగురు భారతీయులు ఉండగా.. తెలుగు రాష్ట్రాలకు నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి ఉన్నారు.  

Tags:    

Similar News