తెలుగు జాతి హర్షించే రోజు ఇది: మంత్రి అనగాని సత్యప్రసాద్

తెలుగు జాతి హర్షించే రోజు ఇది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ అనంతరం

Update: 2024-07-06 16:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు జాతి హర్షించే రోజు ఇది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ అనంతరం తెలంగాణ మంత్రులతో కలిసి అనగాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలను అనగాని మీడియాకు వెల్లడించారు. గత కొన్ని ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. ఈ కమిటీల ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ఇకపై తెలంగాణ, ఏపీ కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. కాగా, రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి ఏపీ తరుఫున మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో 6 గంటలకు మొదలైన రెండు రాష్ట్రాల సీఎంల భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది. గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారమే ఏజెండాగా ఈ సమావేశం జరిగింది.


Similar News