CM Chandrababu: సీఎం చంద్రబాబు ఔదార్యం.. క్యాన్సర్‌ బాధితుడికి రూ.5 లక్షల సాయం

తిరుమల (Tirumala) టూర్ ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి (Renigunta Airport)కు చేరుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-10-05 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) టూర్ ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి (Renigunta Airport)కు చేరుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన అందరితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం లివర్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న పసుపులేటి సురేంద్రకు సీఎం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సురేంద్ర, చంద్రబాబు వీరాభిమాని కావడంతో ఆయనతో ఫొటో దిగాలనే కోరికను సీఎం కూడా నేరవేర్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Similar News