Manthena Rama Raju:ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రామరాజు

ఏపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నూతన ఏపీఐఐసీ ఛైర్మన్‌ని నియమించారు.

Update: 2024-10-05 08:03 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నూతన ఏపీఐఐసీ ఛైర్మన్‌ని నియమించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) ఛైర్మన్‌గా మంతెన రామరాజు(Manthena Rama Raju) ఈరోజు (శనివారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తనను నమ్మి ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), కూటమి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన APIIC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని రామరాజు అన్నారు. గతంలో టీడీపీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు దీని ద్వారా ‘కియా’, ‘హీరో’  పరిశ్రమలను(industries) ఎన్నో తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఏపీఐఐసీ తరఫున ప్రతి నియోజకవర్గంలో లేఔట్ తయారు చేసి ముందుకు వెళ్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ(YCP) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో APIICని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.


Similar News