AP:‘చిన్నారి దారుణ హత్య’.. ప్రభుత్వం పై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలోని తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్‌కు గురై ఆ తర్వాత హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు.

Update: 2024-10-05 09:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్‌కు గురై ఆ తర్వాత హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి కలిచివేసింది అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పై ఫైరయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ లేదని, పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

చిన్నారి దారుణంగా హత్యకు గురైన ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగితే ప్రభుత్వం డీజీపీకి హెలికాప్టర్ ఇచ్చి పంపిందన్నారు. కానీ చిన్నారి చనిపోతే మాత్రం ఇప్పటి వరకు సీఎం కానీ, మంత్రులు కానీ స్పందించలేదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఈ ఘటన పై వెంటనే పోలీసులు స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News