AP News:‘వాళ్లంతా రెడ్ బుక్లో ఉన్నారు’..మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నోట మరోసారి 'రెడ్ బుక్' మాట వచ్చింది. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
దిశ,వెబ్డెస్క్:రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నోట మరోసారి 'రెడ్ బుక్' మాట వచ్చింది. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మరోసారి రెడ్ బుక్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్లో ఉన్నారని ఆయన అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న IPSలపై నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు.