జగన్‌కు సీఎం హోదా భద్రత కుదరదు.. పోలీస్ శాఖ ప్రకటన

తనకు సెక్యూరిటీ తగ్గించారన్న ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాదనపై పోలీస్ శాఖ స్పందించింది...

Update: 2024-08-05 14:40 GMT

దిశ, వెబ్ డెస్క్: తనకు సెక్యూరిటీ తగ్గించారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఉన్న సెక్యూరిటీనే ప్రభుత్వం  కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్పించిన భద్రత ప్రాముఖ్యతను పిటిషన్‌లో గుర్తు చేశారు.

అయితే జగన్ పిటిషన్‌పై పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే తగ్గించామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అదే సెక్యూరిటీ కల్పించడం కుదరదని తేల్చి చెప్పాయి. జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారమే జగన్‌కు భద్రత కల్పిస్తున్నామని వెల్లడించాయి. జగన్‌కు భద్రత తగ్గించారన్న వాదనను కొట్టిపారేశాయి. 

Tags:    

Similar News