టీడీపీ నేతల్లో ఉప్పొంగిన ఉత్సాహం..అట్టహాసంగా వంద రోజుల పాలనపై సంబరాలు

టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో వంద రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టీడీపీ నేతల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఉరకలేసింది.

Update: 2024-09-19 13:29 GMT

దిశ, రాజంపేట:టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో వంద రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టీడీపీ నేతల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఉరకలేసింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. ముందుగా టీడీపీ నేతలు సుగవాసికి జూనియర్ కళాశాల వద్ద బాణసంచా పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నేతలతో కలిసి సుగువాసి కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న 100 రోజుల పాలనకు గుర్తుగా భారీ కేక్ కట్ చేసి ఆనందోత్సవాల మధ్య పార్టీ ఐక్యతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొని సుగవాసికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే నాయకుడే చంద్రబాబు అన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్వీ రమణ, కె ఎస్ నరసింహ శరన్న గ్రానైట్స్, డాక్టర్ సుధాకర్, నాగినేని నాగేశ్వరరావు నాయుడు, మండల అధ్యక్షుడు గన్నె సుబ్బ నరసయ్య నాయుడు, రవి నాయుడు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Similar News