ఇసుక అక్రమ రవాణాపై జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం.. పలు వాహనాల సీజ్

ఇసుక అక్రమ రవాణాపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.........

Update: 2024-08-11 16:29 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇసుక అక్రమ రవాణాపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గం నందలపాడు ఏరియా ఇసుక డంప్‌ల్లో తనిఖీలు చేశారు. అక్రమంగా ఇసుక రావాణా చేస్తున్న వాహనాలను దగ్గరుండి వాహనాలు సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే సొంతవారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఇసుక అక్రమంగా రవాణా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేననన్నారు. రాత్రి సమయంలోనూ కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పోలీసులు తనిఖీలు నిర్వహించాలని జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశించారు. 

Tags:    

Similar News