Supreme Court: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. సుప్రీం కోర్టులో వైసీపీ నేతలకు ఊరట

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు భారీ ఊరట లభించింది.

Update: 2024-09-13 07:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు భారీ ఊరట లభించింది. కేసులో కీలక నిందితులైన దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వారందరూ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. అదేవిధంగా దేశం విడిచి వెళ్లకుండా 48 గంటల్లోగా పాస్‌పోర్టులను దర్యాప్తు సంస్థ అధికారులకు అందజేయాలని జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. కేసులో తదుపరి విచారణను నవంబర్ 4‌కు వాయిదా వేసింది. వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు. 


Similar News