నాలుగేళ్లలో నలభై ఏళ్ళ అభివృద్ధి: కొండ్రెడ్డి రంగారెడ్డి

నాలుగేళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 40 సంవత్సరాల అభివృద్ధి చేశారని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు..

Update: 2023-04-13 15:20 GMT

దిశ, నెల్లూరు సిటీ: నాలుగేళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 40 సంవత్సరాల అభివృద్ధి చేశారని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం 41వ డివిజన్‌లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా జగన్‌కు మద్దతు తెలుపుతూ 82960 82960 నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు కువ్వాకొల్లు బాబ్జి, సుతారం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News