నెల్లూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి 18 మంది కార్పొరేటర్లు..!

నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది....

Update: 2024-09-14 08:14 GMT

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో (Nellore)  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (Ysrcp) బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో (Tdp)  చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ నుడా చైర్మన్ ద్వారకానాథ్ మంత్రి నారాయణను (Minister Narayanya) కలవడంతో నెల్లూరు సిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.


సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) సమక్షంలో కార్పొరేటర్లంతా పసుపు జెండా కప్పుకోనున్నారని పలువురు టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఇప్పటికే నెల్లూరు మేయర్ దంపతులతోపాటు పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా 18 మంది కార్పొరేటర్లు వీడుతుండటంతో నెల్లూరు సిటీలో పార్టీ ఖాళీ అవుతుందనే ఆందోళన వైసీపీ నేతల్లో మొదలైంది. 


Similar News