ఆ విషయంలో జగన్ రోల్ మోడల్: ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-09-14 08:49 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ (Ycp Chief Jagan) శుక్రవారం కాకినాడ  (Kakinada District) జిల్లా ఏలేరు వరద (Yeleru Floods) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వరదలపై ముందే సమాచారం ఉన్నా బాధితుల్ని ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం చేయలేదంటూ ప్రశ్నించారు. ఏలేరు వరదల పాపం ప్రభుత్వానిదేనంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విపత్తును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు రోల్‌ మోడల్‌ అని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్‌ రోల్‌ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్‌ హయాంలో వరద వస్తే కాకినాడ మునిగిందని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖలను మూసేశారని ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్‌కు (Yeleru Reservoir) ఊహించని వరద వచ్చిందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా కాపాడటంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. 


Similar News