Somireddy: దేశం విడిచి వెళ్లిపో జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగన్ కు మతి చెలించిందని, స్థిమితం కోల్పోయి దేశాన్ని, మతాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్లిపోయాడని సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-28 10:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జగన్ కు మతి చెలించిందని, స్థిమితం కోల్పోయి దేశాన్ని, మతాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్లిపోయాడని సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ నేత జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. వైసీపీ నాయకులు సొంత నియోజకవర్గాలకు, తమ జిల్లాలకు పోలేకపోతున్నారని, జగన్ తాను పుట్టిన రాయలసీమలో ఉన్న తిరుపతికి కూడా పోలేనంతగా పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు. జగన్ ఇదేం దేశం అని మాట్లాడటానికి సిగ్గుండాలని, దేశం నచ్చకపోతే ఏ సౌదీ అరేబియాకో.. దుబాయ్ లేదా పాకిస్థాన్ కి వెళ్లిపోవాలని, భారతీయుడిని కాదని చెప్పి దేశం విడిచి పోవాలని అన్నారు.

తిరుమల డిక్లరేషన్ మీద సంతకం పెడితే భారతమ్మ ఇంట్లోకి రానివ్వదా? లేక క్రిస్టియన్ల ఓట్లు పోతాయని పర్యటన రద్దు చేసుకున్నావా అని ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్లకాడు చేసిన నీకు దేశాన్ని, మతాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కొడుకుతో వేగలేకపోతున్నామని నీ తల్లిదండ్రులు రోషయ్య దగ్గర బోరున ఏడ్చారని, కన్న తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న నీకు రాష్ట్రం మీద, దేశం మీద గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చూడలేదని, రాజకీయ నాయకుడిని అని చెప్పుకోవడానికి జగన్‌కు అర్హత లేదని మండిపడ్డారు. జగన్ వెంటనే దేశానికి, రాష్ట్రానికి, ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.


Similar News