ఏపీలో నిలిచిన రిజిస్ట్రేషన్లు

Update: 2023-12-01 12:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్ కేవైసీ రిజిస్ట్రేషన్ సమయంలో ఓపెన్ అవకపోవటంతో రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచి వెయిట్ చేసిన ఖాతాదారులు విసుగెత్తిపోయారు. చివరకు సేవలు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి వినియోగదారులు వెళ్లిపోయారు. ఇకపోతే నేడు రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి ఇదే సమస్య ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు గతంలోనూ అనేకసార్లు చోటు చేసుకోవడం...సేవలు నిలిచిపోవడం తెలిసినదే. 

Tags:    

Similar News