Chandrababu సభపై Ram Gopal Varma సంచలన వ్యాఖ్యలు

గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటపై రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా విసిరారు అని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-05 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటపై రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా విసిరారు అని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద గ్రౌండ్‌లో అయితే జనం కనిపించరని చిన్న గ్రౌండ్‌లో సభను ఏర్పాటు చేశారన్నారు. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇలా జరుగుతుందని తెలియదా అని ఆర్జీవీ చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే హిట్లర్, ముస్సోలినీ తర్వాత ఆ తరహా వ్యక్తిని చంద్రబాబులో చూస్తున్నానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. మీ పర్సనల్ ఇగో, ఫొటోల కోసం జనం ప్రాణాలు తీశారని తీవ్ర విమర్శలు చేశారు. మీ పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అని అర్జీవీ ఫైర్ అయ్యాడు.

Also Read....

Heat Politics: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే .. కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం

Tags:    

Similar News