ఏపీలో గణేష్ మండపాలకు అనుమతి పై పోలీస్ శాఖ కీలక ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2024-08-31 15:00 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారికి పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ‘గతంలో అగ్నిమాపక, విద్యుత్, పోలీస్ శాఖల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉండేది. ఈ సారి ganeshustav.net వెబ్‌సైట్ లేదా 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఈ క్రమంలో మీ సేవలో రుసుము చెల్లించిన తరువాత NOC జారీ చేస్తారు. దీన్ని మండపంలో ఉంచాలి అని పేర్కొన్నారు.


Similar News