Fighting: భగ్గుమన్న పాత కక్షలు.. టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడులు

పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి...

Update: 2024-10-27 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు(Tense situations) కొనసాగుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం కొమరపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ (TDP and YCP) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రాళ్లు, కర్రల(Stones and sticks)తో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పాత కక్షలు చెలరేగడంతో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామంలో గస్తీ చేపట్టారు. షాపులను మూయించివేశారు. ఎవరినీ బయటకు రాకుండా నిఘా పెట్టారు. దీంతో కొమరపూడిలో వీధులన్నీ నిర్మాణుష్యంగా మారాయి.


Similar News