నెల్లూరు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి ఆనం కీలక ప్రకటన

త్వరలో దగదర్తి ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు...

Update: 2024-10-27 16:18 GMT

దిశ, వెబ్ డెస్క్: త్వరలో దగదర్తి ఎయిర్‌పోర్ట్(Dagdarti Airport) పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. నెల్లూరు జిల్లా(Nellore District)లో పరిశ్రమలు(industries), ఎయిర్‌పోర్ట్స్ ఏర్పాట్లపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టులు, జువ్వల దిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లున్నాయని, వీటికి అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. దగదర్తి ఎయిర్‌పోర్ట్‌కు 1379 ఎకరాల భూములు అవసరమని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు తీసుకున్న భూమికి సంబంధించి కొంతమందికి పరిహారం అందజేశామని తెలిపారు. నెల్లూరు నగరం(Nellore city) చుట్టూ ఉన్న రైసు మిల్లులను ఇతర ప్రాంతాలను తరలించాలని తాము అనుకుంటున్నామని పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు(Krishnapatnam Port)ను కిసాన్ సెజ్‌లోకి మార్చాలని భావిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు.


Similar News