విదేశీ పర్యటన అనుమతి కోరుతూ వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి పిటిషన్

సెప్టెంబరులో విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-08-20 13:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబరులో విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు విజయసాయి రెడ్డి కూడా రానున్న రెండు నెలల విదేశీ పర్యటనల నిమిత్తం అనుమతులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇక విజయసాయి రెడ్డి పిటిషన్ విచారణలో వాదనలు పూర్తయ్యి, తీర్పును కోర్ట్ ఈ నెల 30కి వాయిదా వేసింది.  


Similar News