Palnadu: తండాలో పులి.... బంధించండి బాబో..!

పల్నాడు జిల్లా హనుమాపురంతండాను పులి వణికిస్తోంది...

Update: 2024-08-16 02:35 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా హనుమాపురంతండాను పులి వణికిస్తోంది. రెండు, మూడో రోజులుగా జనవాసాల్లో సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తోంది. రాత్రి సమయంలో మేకల మందలపై దాడులు చేస్తోంది. పులి దాడిలో మేక మృతి చెందింది. పులి పగలు అటవీ ప్రాంతంలో ఉంటూ రాత్రి సమయంలో హనుమాపురం తండా వైపు వెళ్తోంది. కనిపించిన జంతువులపై దాడి చేస్తోంది. గురువారం రాత్రి మేకలమందపై దాడి చేయడాన్ని స్థానికులు గమనించి గట్టి కేకలు వేశారు. దీంతో పులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.

పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. ఈ మేరకు పులిని పట్టుకునేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా తిరగొద్దని సూచించారు. అయితే హనుమాపురం తండా వాసులు మాత్రం భయాందోళకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టేందుకు జంకిపోతున్నారు. పులి ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. త్వరగా పులిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పులి మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Tags:    

Similar News