ముగిసిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2024-09-18 15:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో ఈ సమావేశం జరగ్గా.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan), ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి(Purandeshwari) ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గోనగా.. సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 8.30 గంటలకు ముగిసింది. కాగా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ఇసుక సహా.. ఎలాంటి అక్రమాల జోలికి వెళ్లొద్దని సున్నితంగా హెచ్చరించించినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ప్రజల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు సీఎం(CM) సూచించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి ఇస్తామని శాసనసభా పక్ష(Legislature Party) భేటీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.


Similar News